ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. తల్లికి వందనంపై భారీగా ప్రచారం చేసి.. చేతులెత్తేసే ప్రయత్నం చేశారని ఫైర్ చేశారు. ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారని… ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని నిలదీశారు.