రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు

రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను (FDC) ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “వన్ స్టేట్ – వన్ కార్డు” ఆలోచనతో రూపొందించిన ఈ బహుళ ప్రయోజన కార్డులు, ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను ముఖ్యమంత్రి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంలో, FDC ప్రాధాన్యతను వివరించారు.

ప్రస్తుతం, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, షాదీ ముబారక్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 30 శాఖల ద్వారా సేకరించబడుతున్న వివరణలు కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా అన్ని సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందిస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రక్రియను 3 నుంచి 5 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిపక్షాలకు సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయాలని కోరారు.

కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగినందున, ప్రజలు కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలని హితవు పలికారు. అవసరమైన మార్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక క్లిక్ తో కుటుంబ సమాచారాన్ని అందించేందుకు ఈ విధానం తీసుకొచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading