పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు
తెలంగాణ: పారాలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి రాష్ట్రాన్ని గర్వకారణంగా నిలిపిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయల చెక్కును అందజేశారు. కోచ్ నాగపురి రమేష్ గారికి కూడా 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, “మా రాష్ట్రానికి ఈ ఘనత ఎంతో గర్వకారణం. దీప్తి జీవాంజి మా తెలంగాణ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలిచింది,” అని అన్నారు. అంతేకాక, క్రీడా ప్రోత్సాహం కోసం ప్రకటించినట్టుగా దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థల కేటాయింపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంపై దీప్తి జీవాంజి, కోచ్ నాగపురి రమేష్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. “మాకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహం మరింత మంచి ఫలితాలను సాధించేందుకు సహకరించనుంది,” అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.