విశాఖపట్నం: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్లో జరిగిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జనార్దన్ రెడ్డి, సిఐఐ ఎపి శాఖ చైర్మన్ వి. మురళీకృష్ణ, జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ జిబిఎస్ రాజు వంటి ప్రముఖులతో కలసి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెం.1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని వెల్లడించారు.
ఈ సమ్మిట్లో, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, ఆర్థిక వనరుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమచారం అందించారు. సీఎం చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన రంగాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపట్టాలనుకున్నట్లు తెలిపారు.
ముఖ్యాంశాలు:
జిల్లాల ప్రణాళిక: కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, అనంతపురంలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిత్తూరు-కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, ప్రకాశంలో బయో ఫ్యూయల్, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో క్యాపిటల్ రీజియన్, గోదావరి జిల్లాల్లో ఆక్వాఉత్పత్తుల పరిశ్రమలు అభివృద్ధి చేయడం.
పెట్టీ కెమికల్ కారిడార్: దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్ కారిడార్ నిర్మాణం.
ఐటి హబ్: విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్ ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే నెం.1 ఐటి హబ్గా తయారుచేయడం.
ఫార్మా హబ్: ఉత్తరాంధ్రను ఫార్మా హబ్గా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఎయిర్ కనెక్టివిటీ: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ ఏర్పాటుకు కృషి చేయాలన్న భావన.
ఈ సమ్మిట్లో పాల్గొనడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాలను అమలుకు తీసుకురానున్నామని మంత్రి వివరించారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.