TTD Darshans: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలను మార్చి 24 నుంచి అనుమతించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 24 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
