విశాల్ ఆరోగ్యం గురించి ఖుష్బూ ఏమన్నారంటే?
ఖుష్బూ మాట్లాడుతూ, “విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే డెంగీ జ్వరం వచ్చింది. అయినా మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందనే ఉత్సాహంతో, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈవెంట్కి హాజరయ్యారు. ఆ రోజున ఆయనకు 103°F జ్వరం ఉంది. అందుకే ఆయన్ను వణుకుతూ, బలహీనంగా చూశారు. ఈవెంట్ ముగిసిన వెంటనే మేము విశాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అన్నారు.