కష్ట కాలంలో సెన్సేషన్ డైరెక్టర్లు ..మూసధోరణి వదిలేయాలంటోన్న మూవీలవర్స్ ..!
ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్రకటించడం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మళ్లీ నిలదొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవసరముందున్న మాటలు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.