ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ కు రౌడీ హీరో వాయిస్ ఓవర్

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ అందించడం టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయ్ దేవరకొండ చెప్పిన “నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా” అనే మాటలు రష్మిక విజువల్స్తో మిళితమై టీజర్కి మంచి ఎమోషన్ను తెచ్చాయి. మొత్తం టీజర్ సినిమా అంచనాలను మరింత పెంచుతూనే, రష్మిక నటనపై ఆసక్తిని పెంచింది.