కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ పథకం 19వ విడత నిధుల విడుదల

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ పథకం 19వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. బీహార్లోని భాగల్పూర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. […]