ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2025-26: రూ. 48,340 కోట్లు కేటాయింపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నామని, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టిని పెట్టారని పేర్కొన్నారు. అలాగే, వరిని ప్రోత్సహించాలనే ఆలోచనతో వ్యవసాయ రంగంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అచ్చెన్నాయుడు, ఈ బడ్జెట్లో 11 పంటలను ప్రధాన గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తున్నామని, వాటి అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని […]