Tadepalli Rataining Wall: కృష్ణానదీ తీరంలో వరద ముంపుకు శాశ్వత పరిష్కారం లభించింది. దశాబ్దాలుగా కృష్ణా నది తీరంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లు వరదల సమయంలో ముంపుకు గురయ్యేవి. విజయవాడ వైపు ఇప్పటికే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా తాజాగా తాడేపల్లి వైపు గోడ నిర్మాణానికి క్యాబినెట్ అమోదం తెలిపింది.