Kakinada Tragedy : హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్లో దారుణం జరిగింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారి, అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
