Whatsapp Manamithra: ఏప్రిల్ నెల‌లో ప్ర‌తి ఇంటికి వాట్సాప్‌ మ‌న‌మిత్ర.. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై అవగాహనా కార్యక్రమం

Whatsapp Manamithra: రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగం, వాడ‌కంపైన పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ఏప్రిల్ లో ప్ర‌తి ఇంటికీ మ‌న‌మిత్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ మ‌రియు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని తెలిపారు.

Andhra Pradesh News Live March 25, 2025: ‘‘వైఎస్సార్సీపీ హయాంలో వేల కోట్ల భారీ మద్యం కుంభకోణం’’; లోక్ సభలో టీడీపీ ఎంపీ ఆరోపణలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

‘‘వైఎస్సార్సీపీ హయాంలో వేల కోట్ల భారీ మద్యం కుంభకోణం’’; లోక్ సభలో టీడీపీ ఎంపీ ఆరోపణలు

Andhra Pradesh liquor scam: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 2019-24 మధ్య భారీ మద్యం కుంభకోణం జరిగిందని లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ (TDP) ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆరోపించారు.

AP Anganwadi Jobs : అంగ‌న్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, జీతం.. పూర్తి వివరాలివే

AP Anganwadi Jobs : అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప‌రిధిలో ఖాళీగా ఉన్న948 పోస్టుల‌ను ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో భ‌ర్తీ చేయనున్నారు. అర్హుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్టర్లు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

TDP vs YCP : లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా.. చంద్రబాబు ఆదాయపన్ను నోటీసులపై మాట్లాడండి : పేర్ని నాని

TDP vs YCP : టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఏపీలో బాహుబలి కలెక్షన్లకు మించి లిక్కర్ స్కామ్ జరిగిందని.. టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ వేదికగా ఆరోపించారు. ఆయన కామెంట్స్‌పై పేర్ని నాని ఫైర్ అయ్యారు. లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా అని ఛాలెంజ్ చేశారు.

Pastor Praveen Case : పాస్టర్‌ ప్రవీణ్‌ అనుమానాస్పద మృతి.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

Pastor Praveen Case : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాస్టర్‌ ప్రవీణ్‌ అనుమానాస్పద మృతి చెందారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని.. అతని బంధువులు, క్రైస్తవ ఆరాధకులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.

12వ పీఆర్‌సీ నియామకం, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల డిమాండ్.. కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం

12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన 10 కీలకమైన అంశాలు ఇక్కడ చూడొచ్చు.

Vijayawada : సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. వల్లభనేని వంశీకి రిమాండ్‌ పొడిగింపు.. వచ్చేనెల 4 వరకు జైల్లోనే!

Vijayawada : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ పొడిగించింది. సత్యవర్థన్ కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎల్లుండి తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. వంశీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ 2025-26 విడుదల: కీలక వివరాలు ఇక్కడ చూడండి!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025-26 ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. అడ్మిషన్ల ప్రక్రియ తేదీలు, రిజర్వేషన్లు ఇతర వివరాలను ఇక్కడ చూడొచ్చు.

AP SSC Paper Leak : వాట్సప్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప్రశ్నాపత్రం.. పలు చోట్ల కేసులు న‌మోదు.. విద్యార్థులు డిబార్‌

AP SSC Paper Leak : ఏపీలో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ సంచలనంగా మారింది. టెన్త్ పేపర్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. పలు చోట్ల కేసులు నమోదు చేశారు. కొందరు విద్యార్థులను డిబార్ చేశారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.

Ys Sharmila: పెట్రోల్ ధర రూ.17 తగ్గించండి.. చంద్రబాబు హామీ నెరవేర్చాలన్న షర్మిల

Ys Sharmila: ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల్ని రూ.17 వరకు తగ్గించ వచ్చని చెప్పిన చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో దానిని అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్ ధర అధికమని విమర్శించారు.

Amaravati : కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించాలి : సీఎం చంద్రబాబు

Amaravati : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.