ADCL Recruitment 2025 : అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Amaravati Development Corporation Jobs : అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 7 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలతో పాటు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
Andhra Pradesh News Live March 27, 2025: CBN In Polavaram: 2026 చివరకి పునరావాసం పూర్తి చేశాకే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
CBN In Polavaram: 2026 చివరకి పునరావాసం పూర్తి చేశాకే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న చంద్రబాబు
CBN In Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధతుల పునరావాసాన్ని పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2027లో ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి పునరావాసం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి ముంపు బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
IRCTC Tour: విజయవాడ నుంచి ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర స్పెషల్… ఏప్రిల్ 8 నుంచి 19వరకు టూర్
IRCTC Tour: ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ పర్యాటక రైల్లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్ర 12 రోజుల పాటు ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాల మీదుగా సాగుతుంది. ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ సదుపాయం ఉంది.
AP Power Subsidy: చేనేత కార్మికులకు గుడ్న్యూస్..200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. పవర్ లూమ్లకు 500 యూనిట్లు ఫ్రీ..
AP Power Subsidy:చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kadapa Pocso Case: కడప జిల్లా పొద్దుటూరులో దారుణం.. 9వ తరగతి విద్యార్ధిపై పోక్సో కేసు నమోదు…
Kadapa Pocso Case: ఇన్స్టా గ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి తోటి విద్యార్ధినులను వేధించడంతో పాటు మందలించిన అధ్యాపకులపై తప్పుడు కేసు పెట్టించిన విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. విద్యార్ధితో పాటు అతని తల్లిదండ్రులు, వారికి సహకరించిన కౌన్సిలర్పై కేసు నమోదు చేశారు.
Durga Temple Lands: లీజు పొడిగింపుకు ముందే దుర్గగుడి భూముల లెక్క తేల్చాలంటూ ఉత్తర్వులు.. హెచ్టి తెలుగు ఎఫెక్ట్..
Durga Temple Lands: వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల లీజు పొడిగింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు ఎకరాల భూమి లీజు పొడిగింపుకు ముందే దుర్గగుడి భూముల ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు.
Paster Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి, ఆ 12 నిమిషాలు కీలకం- పోలీసుల చేతికి కీలక ఆధారాలు
Paster Praveen Pagadala : పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి బుల్లెట్ పై వస్తున్న ఆయన సోమవారం రాత్రి కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మరణించారు.
Andhra Pradesh News Live March 26, 2025: Paster Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి, ఆ 12 నిమిషాలు కీలకం- పోలీసుల చేతికి కీలక ఆధారాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
AP TG Heatwave : ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ అలర్ట్- రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ప్రజలకు అడ్వైజరీ
AP TG Heatwave : ఏపీ, తెలంగాణలో సూర్యుడు తీవ్రరూపం దాల్చాడు. రేపు ఏపీలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణలో సాధారణంగా కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు.
Narayana New Campuses : 12 రాష్ట్రాలలో 52 కొత్త క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ విద్యాసంస్థలు
Narayana New Campuses : నారాయణ విద్యా్సంస్థలు దేశవ్యాప్తంగా తమ క్యాంపస్ ను విస్తరిస్తున్నాయి. తాజాగా 12 రాష్ట్రాల్లో 52 కొత్త క్యాంపస్ లు ప్రారంభించినట్లు నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులు ప్రకటించారు. దీంతో నారాయణ క్యాంపస్ ల సంఖ్య 907కు చేరిందని వెల్లడించారు.
Satysai Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, పదో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు
Satysai Crime : శ్రీసత్యసాయి జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రాత్రుళ్లు గదికి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తి్స్తూ, ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. హాస్టల్ లో ఉన్న బాలికను చూసేందుకు తల్లి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.