Guntur Inhuman Incident : గుంటూరులో దారుణం, మొదటి భార్య సంతానానికి చిత్రహింసలు-గొంతు నులిమి ఆరేళ్ల చిన్నారి హత్య
Guntur Inhuman Incident : గుంటూరులో అమానవీయ సంఘటన జరిగింది. మొదటి భార్య కుమారులను రెండో భార్య అతికిరాతకంగా చిత్రహింసలు పెట్టింది. ఆరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్యచేసింది. మరో కుమారుడిని వేడి అట్లపెనంపై కూర్చొబెట్టింది.
CBN in Ugadi Celebrations : పేదరికం లేని సమాజమే నా జీవితాశయం.. ఐదేళ్లూ అందరికీ రాజపూజ్యం : చంద్రబాబు
CBN in Ugadi Celebrations : పేదరికం లేని సమాజమే తన జీవితాశయం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అందరికీ అవమానాలే… ఇక వచ్చే ఐదేళ్లూ అందరికీ రాజపూజ్యమే అని చెప్పారు. ఈ ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో సీఎం ఈ కామెంట్స్ చేశారు.
AP Gurukulam Admissions : ఏపీ గురుకుల స్కూల్స్, కాలేజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు- ఏప్రిల్ 6 వరకు అవకాశం
AP Gurukulam Admissions : ఏపీలోని గురుకుల పాఠశాలలు, ఆర్జేసీ, ఆర్డీసీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. విద్యార్థులు ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రవేశాల దరఖాస్తులను ఏప్రిల్ 9 వరకు పొడిగించారు.
West Godavari Crime : పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం- తన భార్యపై కేసు పెట్టిందని యువతిపై అత్యాచారం, వీడియో తీసి బెదిరింపులు
West Godavari Crime : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తగాదాలో తన భార్యపై కేసు పెట్టిందనే కోపంతో…యువతిపై మహిళ భర్త అత్యాచారం చేశారు. అంతేకాక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Ugadi 2025 : ఉగాది రోజు ముస్లింలు ఈ ఆలయానికి ఎందుకొస్తారు.. 9 ఆసక్తికరమైన విషయాలు
Ugadi 2025 : దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముస్లిం మహిళలు తరలివచ్చారు. ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ, వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అంటూ ఈ పద్దతిని ఆచరిస్తున్నారు ముస్లింలు. దీని గురించి 9 ఆసక్తిరమైన విషయాలు ఇలా ఉన్నాయి.
Vijayawada : ఇంత నిర్లక్ష్యమా.. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు!
Vijayawada : ఇంద్రకీలాద్రి ఆలయ అధికారుల తీరుపై చరుచూ విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అమ్మవారి ప్రసాదంలో మేకు కనిపించింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
AP TTC Coaching : టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి
AP TTC Coaching : టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ (టీటీసీ) వేసవి ట్రైనింగ్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ 3 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనింగ్ 42 రోజుల పాటు ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వివరించారు.
AP Telangana Today : ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇవాళ్టి ముఖ్యమైన అంశాలు.. 13 హైలైట్స్ ఇవే
AP Telangana Today : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు, సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి, వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి ముఖ్యమైన 13 అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Passport Special Drive in AP : సమ్మర్ వేళ రద్దీ…! పాస్పోర్ట్ల జారీకి స్పెషల్ డ్రైవ్ – ఇవిగో వివరాలు
Passport Seva Kendras in AP : పాస్పోర్ట్ల జారీకి ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ మేరకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. పాస్పోర్ట్ సేవలకు పెరిగిన డిమాండ్ను దృష్టిలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
AP TG Rain Alert : తెలంగాణకు అలర్ట్ – మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం దాటితే చాలు భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణకు ఐఎండీ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉండగా.. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
AP Heat Waves: అగ్ని గుండంలా ఆంధ్రప్రదేశ్.. 43డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఎండలతో జనం విలవిల
AP Heat Waves: ఆంధ్రప్రదేశ్లో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. శనివారం ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. మార్చిలోనే ఎండలు ముదరడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు.
Vijayawada Hackers Protest : అధికారపార్టీ నేతల దౌర్జన్యాల నుంచి కాపాడండి, విజయవాడలో చిరు వ్యాపారుల ధర్నా
Vijayawada Hackers Protest : విజయవాడ ధర్నా చౌక్ లో వీధి వ్యాపారులు, హ్యాకర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాల నుంచి తమను రక్షించాలని, సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందించాలని కోరారు.