Ambati Rambabu : చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, జనసేన టీడీపీకి బీ టీమ్ – అంబటి రాంబాబు
Ambati Rambabu : పిఠాపురం జనసేన సభలో పవన్ కల్యాణ్ అసలేం మాట్లాడారో ఆయనకైనా అర్థమైందా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసమే జనసేన స్థాపించారని విమర్శించారు. జనసేన టీడీపీ బీ టీమ్ గా పనిచేస్తుందన్నారు.
Kurnool Medical Jobs : కర్నూలు జిల్లాలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన వివరాలివే
Kurnool Medical Jobs : కర్నూలు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తు దాఖలకు మార్చి 18 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
Pawan Kalyan On Hindi : నేనెప్పుడూ హిందీని వ్యతిరేకించలేదు, నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించా- పవన్ కల్యాణ్
Pawan Kalyan On Hindi : దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో మరోసారి పవన్ కల్యాణ్ స్పందించారు.
Child Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు, ఆధార్ అప్డేట్కు అవకాశం- ఏ తేదీల్లో అంటే?
Child Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు, తిరిగి మార్చి 25 నుంచి మార్చి 28 వరకు రెండు విడతల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తారు.
APOBMMS Subsidy Loans : బీసీ,ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు-దరఖాస్తు విధానం ఇలా
APOBMMS Subsidy Loans : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు…స్వయం ఉపాధి పథకాలు, జనరికి మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై రుణాలు అందిస్తుంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు సబ్సిడీ రుణ సదుపాయం కల్పించింది. అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
APEDB Jobs : ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో 22 ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు- భర్తీకి ప్రభుత్వం అనుమతి
APEDB Jobs : ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 22 పోస్టులు భర్తీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 526 విడుదల చేసింది. ఐదు విభాగాల్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు పోస్టులకు నియామకాలు చేపడతారు.
CM Chandrababu : 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు సీఎం- నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజాసేవ : సీఎం చంద్రబాబు
CM Chandrababu : ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం మార్చి 15న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 41 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నానన్నారు. తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
AP ICET 2025 Registration : ఏపీ ఐసెట్-2025 దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి
AP ICET 2025 Registration : ఏపీ ఐసెట్-2025 దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. మే 7న ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.
Viveka Murder Case : వివేకా హత్యకు గురై ఆరేళ్లు.. నిందితులకన్నా మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నాం : సునీత
Viveka Murder Case : సరిగ్గా ఆరేళ్ల కిందట.. పులివెందులలో సంచలన ఘటన జరిగింది. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటు అని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత హత్య అని పోలీసులు విర్ధారించారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ శిక్ష పడలేదు. తాజాగా ఆయన కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Farmers : రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా
AP Farmers : రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ యంత్రాలతో రైతులకు ఎంతగానో ప్రయోజనం జరుగుతుందని తెలిపింది. చిన్న సన్నకారు రైతులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది.
Kurnool Crime : కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో దాడి.. ప్రాణం తీసిన ఆధిపత్య పోరు!
Kurnool Crime : కర్నూలు జిల్లాలో మళ్లీ హత్యలు ప్రారంభమయ్యాయి. ఆధిపత్య పోరు కారణంగా మరో నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ కార్పొరేటర్ మర్డర్తో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. కత్తులతో నరికి చంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP TG Maoist : వయోభారంలో సారథ్యం.. పట్టు కోల్పోతున్న మావోయిస్టు పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్థకంగా ఉనికి!
AP TG Maoist : ఏడాది కాలంగా ఛత్తీస్గఢ్ అడవులు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు, సానుభూతిపరులు చనిపోయారు. దీంతో నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తన మేథో పునాదిని, సైద్ధాంతిక బలాన్ని వేగంగా కోల్పోతోంది.