AP Private Universities: అమరావతిలో బిట్స్‌… ఏపీలో ప్రైవేట్‌ యూనివర్శిటీల చట్టంపై లోకేష్‌ కీలక ప్రకటన…

AP Private Universities: ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీస్ యాక్ట్ ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల వివరాలతో పాటు, విశ్వవిద్యాలయ హోదాను ఇవ్వడానికి అనురిస్తున్న ప్రమాణాలను సభలో వివరించారు. 

AP Fee Reimbursement : వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదు.. బకాయిలు కచ్చితంగా చెల్లిస్తాం : లోకేష్

AP Fee Reimbursement : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తామని.. మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. విద్యారంగంపై చర్చ కావాలని అడిగి.. వైసీపీనే పాల్గొనలేదన్నారు. వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదన్న మంత్రి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం… ఇన్‌స్టా గ్రామ్‌ ప్రేమ.. ఆపై పెళ్లి..గుంటూరులో వరంగల్‌ అమ్మాయి అనుమానాస్పద మృతి

Guntur Crime: గుంటూరు జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. సామాజిక మాధ్య‌మం ఇన్‌స్టాగ్రాంలో యువ‌త‌ని ప్రేమిస్తున్నానంటూ న‌మ్మించి పెళ్లి చేసుకున్నాడు. గంజాయికి బానిసై ఆరు నెల‌లు తిర‌గ‌కుండానే క‌ట్నం కోసం చిత్ర హింస‌లు పెట్టడంతో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 

Anakapalle : అన‌కాప‌ల్లిలో కుంగిన రైల్వే బ్రిడ్జి.. తప్పిన ప్రమాదం.. ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లకు అంత‌రాయం

Anakapalle : అన‌కాప‌ల్లిలో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి కుంగింది. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్పడింది. ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మరమ్మత్తులు అయ్యేవరకు రైళ్లను అనుమతించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ న్యూస్.. 6 ముఖ్యమైన అంశాలు

AP Telangana Today : ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అటు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీ4 విధానం, సంక్షేమంపై చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ముఖ్యమైన 6 అంశాలు ఇవా ఉన్నాయి.

AP Pensions : పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇకనుంచి వేలిముద్రల కష్టాలు ఉండవు!

AP Pensions : పింఛన్ల కోసం పండుటాకులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వేలిముద్ర సరిగా రాక.. పాట్లు పడేవారు. ఈ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. వేలిముద్రల కోసం కొత్తగా స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Kakinada Tragedy : నా భార్య చాలా మంచిది.. పిల్లలను చంపడానికి కారణం అదే.. సూసైడ్ నోట్‌లో చంద్రకిశోర్‌!

Kakinada Tragedy : హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో దారుణం జరిగింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారి, అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

AP Heatwave Alert : ఏపీ వాసులు బీఅలర్ట్, రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

AP Heatwave Alert : ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Andhra Pradesh News Live March 16, 2025: AP Heatwave Alert : ఏపీ వాసులు బీఅలర్ట్, రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

AP SSC Exams : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

AP SSC Exams : ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

Private College Principal : హోలీ పేరుతో విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ అనుచిత ప్రవర్తన, కేసు నమోదు

Private College Principal : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. హోలీ సంబరాల పేరిట ఎక్కడిపడితే అక్కడ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రిన్సిపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో డీసీహెచ్ హాస్పిటల్‌లో 29 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన తేదీలివిగో

Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 29 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మార్చి 21గా నిర్ణయించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్ధతుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.