Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో విషాదం, కొండపై అగ్ని ప్రమాదం-మేతకోసం వెళ్లి 65 మూగజీవాలు మృతి
Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొండపై మేతకోసం వెళ్లిన మూగజీవాలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో 62 జీవాలు అగ్నికి ఆహూతయ్యాయి. దాదాపుగా 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని ఆవేదన చెందుతున్నాడు.
AP Anganwadi Jobs : అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
AP Anganwadi Jobs : అల్లూరు సీతారామరాజు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలుకు ఏప్రిల్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు, వయో పరిమితి, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Nara Lokesh: 10నెలల్లోనే ఏపీకి రాష్ట్రానికి రూ.8లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న నారా లోకేష్
Nara Lokesh: విశాఖ నగరాన్ని ఎకనమిక్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని, దేశంలో 5వ అతిపెద్ధ ఆర్థికనగరంగా విశాఖ మహానగరం అవతరిస్తుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖ సాగర తీరంలో తాజ్ – వరుణ్ బే శాండ్స్ హోటల్ కు మంత్రి లోకేష్, తల్లి భువనేశ్వరితో కలిసి శంకుస్థాపన చేశారు.
Trains Cancellation: రైల్వే ప్రయాణికులకు అలర్ట్…ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే 32 రైళ్లు రద్దు…
Trains Cancellation: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. నాన్ ఇంటర్లాకింగ్ పనులను కారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాకపోకలు నిర్వహించే 32 రైళ్లను రద్దు చేశారు. అలాగే 11 రైళ్లలను దారి మళ్లించారు.
HYD-VJA Highway : హైదరాబాద్- విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీకు శుభవార్త!
HYD-VJA Highway : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాదారులకు ఎన్హెచ్ఏఐ శుభవార్త చెప్పింది. టోల్ రుసుము తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తగ్గిన టోల్ ఫీజులు అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వరకు కొత్త రేట్లు అమలులో ఉండనున్నాయి.
Durga Temple: బెజవాడ దుర్గమ్మ పుట్టినిల్లుగా పోలీస్ స్టేషన్ ప్రచారంలో నిజమెంత… ఆలయంపై పట్టుకోసమే ప్రచారాలు!
Durga Temple: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి పుట్టినిల్లుగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ను కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి చారిత్రక నేపథ్యానికి, వన్టౌన్ పోలీస్ స్టేషన్కు ఎలాంటి సంబంధం లేకున్నా ఈ ప్రచారం ఆగడం లేదు.
Eluru Jail: ఏలూరు జిల్లా జైల్లో మహిళా ఖైదీ ఆత్మహత్య.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో నిందితురాలు
Eluru Jail: ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్యకు పాల్పడింది. భర్తను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన వారం రోజుల్లోనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో జైల్లో విధులు నిర్వహిస్తోన్న ఇద్దరు జైలు సిబ్బందిని జైలు అధికారులు సస్పెండ్ చేశారు.
AP Telangana Today : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇవాళ్టి కార్యక్రమాలు.. 12 ముఖ్యాంశాలు
AP Telangana Today : ఏపీలో అక్రమ మైనింగ్ కేసు హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు, బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మునగపాకలో మంత్రి లోకేష్ పర్యటన.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి 12 ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vizag Crime: మాజీ ప్రియుడిపై కక్ష తీర్చుకోడానికి బైక్కు నిప్పు పెడితే, 14 వాహనాలు దగ్ధం..
Vizag Crime: విశాఖలో మాజీ ప్రియుడిపై కక్ష తీర్చుకోడానికి ఓ యువతి బైక్కు నిప్పు పెట్టింది. ఈ ఘటనలో ఏకంగా 14 వాహనాలు కాలిపోయాయి. ఓ ఇంట్లో ఫర్నిచర్ కూడా దగ్దమైంది. సీసీటీవీల్లో నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.
Pastor Death Case: పాస్టర్ మృతి కేసులో వీడుతున్న మిస్టరీ.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీ, విజయవాడలోనే మూడు గంటలు
Pastor Death Case: రాజమండ్రి సమీపంలో పాస్టర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించారు. విజయవాడలో నాలుగు గంటల పాటు పాస్టర్ అదృశ్యం కావడం వెనుక కారణాలను పోలీసులు గుర్తించారు. చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారి మధ్యలో రెండు సిగ్నల్స్ మధ్య ప్రయాణంలో నాలుగు గంటల జాప్యాన్ని గుర్తించారు.
Margadarsi Bangaru Kutumbam : పీ4 ఓ గేమ్ ఛేంజర్, పేదరికం లేని సమాజం కోసమే కృషి- సీఎం చంద్రబాబు
Margadarsi Bangaru Kutumbam : పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ పేరిట పీ4 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు.
Sathyasai Tragedy : పండుగ పూట తీవ్ర విషాదం, సైనైడ్ తాగి బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహత్య
Sathyasai Tragedy : శ్రీసత్యసాయి జిల్లాలో పండగ పూట విషాధం అలుముకోంది. బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. సైనైడ్ తాగి ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.