Gudur Railway Junction: గూడూరు రైల్వే జంక్షన్ అభివృద్ధికి రూ.48కోట్లు మంజూరు, మారనున్న రూపు రేఖలు
Gudur Railway Junction: గూడూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49.18 కోట్లు మంజూరు చేసింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణీకుల సౌకర్యాల ప్రమాణాలను పెంచేందుకు, రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేలా ఈ నిధులు ఖర్చు చేస్తారు.
VMC Works: బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…
VMC Works: పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని విజయవాడలో పప్పు బెల్లాల మాదిరి ఖర్చు పెట్టేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రూపంలో నిధుల్ని వెచ్చించాలనే లక్ష్యంతో వంద కోట్ల నిధుల్ని వృధా చేశారు.
TTD Darshanam Quota: నేడు టీటీడీ జూన్ నెల కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల… ఉదయం 10 నుంచి అందుబాటులో…
TTD Darshanam Quota: తిరుమల శ్రీ వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటాను మంగళవారం విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
AP Cabinet Decisions : చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు-ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెల్పింది. వై.ఎస్.ఆర్. జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనను ఆమోదించింది.
Andhra Pradesh News Live March 17, 2025: AP Cabinet Decisions : చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు-ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు
Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో వర్దమాన నటులు, బుల్లితెర నటులు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్ల వలలో చిక్కి యువత బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
Cases Filed on Telugu Celebrities : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు
Cases Filed on Telugu Celebrities : సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ నటులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు పెట్టారు.
AP Housing For Poor : ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి పట్టాలు, ఇలా దరఖాస్తు చేసుకోవాలి
AP Housing For Poor : ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాలు కావాలనుకున్న వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
TTD Darshans: టీటీడీ కీలక నిర్ణయం, మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై శ్రీవారి దర్శనం
TTD Darshans: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలను మార్చి 24 నుంచి అనుమతించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 24 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
AP Puramitra App : “పుర మిత్ర” యాప్తో ఎన్నో ప్రయోజనాలు, 150 పౌరసేవలు అందుబాటులోకి
AP Puramitra App : ఏపీ ప్రభుత్వం పురపాలక సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పుర మిత్ర యాప్ అందుబాటులోకి తెచ్చింది. . పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు పౌర సేవలను సులువుగా పొందేందుకు ఈ యాప్ ఉపయోగ పడుతుందని పురపాలక మంత్రిత్వ శాఖ చెబుతోంది.
AP Free Sewing Machine : మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు- సచివాలయాల్లో దరఖాస్తులు ప్రారంభం, ఏఏ పత్రాలు అవసరమంటే?
AP Free Sewing Machine Scheme : ఏపీ ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహిచేందుకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తుంది. దీంతో పాటు టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ ఇస్తుంది. కుట్టుమిషన్ల దరఖాస్తు ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం అయ్యింది.
APPSC Updates: ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్ల విడుదల, మార్చి 25న మూడు నోటిఫికేషన్లకు ప్రధాన పరీక్ష
APPSC Exams: ఏపీపీఎస్సీ 2023, 2024లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు మార్చి 25న మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్, పీసీబీ గ్రేడ్ 2 అనలిస్ట్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పరీక్షలను మార్చి 25న సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.