SC Sub Classification in AP : 2026 సెన్సెస్ ప్రకారమే జిల్లాల వారీగా వర్గీకరణ – అసెంబ్లీలో కీలక ప్రకటన
ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ఎన్నికల ప్రచారంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పామని… అదే నిజం చేసి చూపించామన్నారు. 2026లో వచ్చే సెన్సెస్ ప్రకారం జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.
AP Medical Jobs 2025 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు – కేవలం ఇంటర్వూనే
ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు మార్చి 24వ తేదీన నిర్వహించే ఇంటర్వూలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం 14 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
APPSC FRO Key 2025 : ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ‘కీ’ విడుదల – ఇలా డౌన్లోడ్ చేసుకోండి
APPSC FRO Answer Key 2025 : ఎఫ్ఆర్ఓ స్క్రీనింగ్ టెస్ట్ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వివరాలను పేర్కొంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కీపై ఏమైనా అభ్యరంతరాలు ఉంటే ఆన్లైన్ ద్వారా మార్చి 23వ తేదీ వరకు తెలపవచ్చు.
Prakasam District Jobs 2025 : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ వివరాలివే
ప్రకాశం జిల్లాలోని ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 16 ఖాళీలున్నాయి. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు…. మార్చి 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Bettings Apps Case: రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25మందిపై బెట్టింగ్ యాప్ కేసులు
Bettings Apps Case: హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ వ్యవహారం సినీ ప్రముఖల మెడకు చుట్టుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై పోలీసులు దృష్టి సారించడంతో పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
APPSC DEO Hall Tickets: ఏపీపీఎస్సీ డీఈఓ హాల్ టిక్కెట్ల విడుదల, మార్చి 26 నుంచి పరీక్షలు
APPSC DEO Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించి పరీక్షకు హాల్ టిక్కెట్లను కమిషన్ విడుదల చేసింది. గత ఏడాది జూన్లో ప్రిలిమ్స్ పరీక్షల్ని నిర్వహించారు.
Reddys Lab Molecule: రెడ్డీస్ ల్యాబ్లో కోట్ల ఖరీదు చేసే టైప్2 డయాబెటిస్ మాలిక్యూల్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
Reddys Lab Molecule: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రెడ్డీస్ ల్యాబరేటరీలో కోట్ల రుపాయలు ఖర్చుతో ఆవిష్కరించిన ఔషధ రసాయినిక మూలకం చోరీకి గురి కావడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిశోధన కేంద్రంలో భద్ర పరిచిన మాలిక్యూల్ చోరీ అయినట్టు పోలీసులు కేసు నమెదు చేశారు.
Anakapalli Crime: అనకాపల్లిలో ఘోరం… హిజ్రాతో సహజీవనం…మరో హిజ్రాతో సంబంధాన్ని నిలదీసినందుకు దారుణ హత్య
Anakapalli Crime: అనకాపల్లిలో మూటలో శవమై కనిపించిన హిజ్రా హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హిజ్రాతో సహజీనవం చేసే వ్యక్తి, గంజాయికి అలవాటు పడి మరో హిజ్రాతో సంబంధాన్ని కొనసాగిస్తాడాన్ని ప్రశ్నించినందుకు హిజ్రాను హత్య చేసినట్టు గుర్తించారు.
Save Besant Road: బెజవాడలో అంతే…రోడ్లనే అద్దెకిస్తారు, లక్షల్లో సంపాదిస్తారు.. చోద్యం చూస్తోన్న ప్రభుత్వ యంత్రాంగం
Save Besant Road: విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన బీసెంట్ రోడ్డులో అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి. మునిసిపల్ రోడ్డును హాకర్లకు అద్దెలకిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ దందా శృతి మించడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్ రోడ్డు కాంపెయిన్ ప్రారంభించారు.
VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్
VMC Lands: విజయవాడ అజిత్ సింగ్నగర్లో ఉన్న 110 ఎకరాల కార్పొరేషన్ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. డిస్నీ ల్యాండ్ నిర్వహించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
KGBV Admissions: ఏపీ కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్ దరఖాస్తులు
KGBV Admissions: ఆంధ్రప్రదేశ్ కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 22 నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ ప్రకటించారు.
Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లి అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంటును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత మల్లవల్లిలో అశోక్ లేలాండ్ సంస్థ ప్లాంటును నిర్మించినా ఆ తర్వాతి కాలంలో అది ప్రారంభం కాలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్లాంటు కార్యకలాపాలు మొదలయ్యాయి.