ACB Case On Vidadala Rajini : బిగిస్తున్న ఉచ్చు….! మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు
ACB Case On Ex Minister Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. 2020లో శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు దాఖలయ్యాయి. బెదిరించి రూ.2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విడదల రజనీని ఏ1గా చేర్చారు.
AP TG Weather News : కొనసాగుతున్న ‘ద్రోణి’ ప్రభావం – ఇవాళ కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు…! ఈ జిల్లాలకు హెచ్చరికలు
Rains in AP Telangana: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు – 11న రాములోరి కల్యాణం, పూర్తి వివరాలివే
Vontimitta Brahmotsavalu 2025 Updates : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది. ఏప్రిల్ 11వ తేదీన సీతారాముల కల్యాణం ఉంటుంది.
AP TG Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్- రేపు ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు
AP TG Rains : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రేపు(ఆదివారం) ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు హెచ్చరించారు. పలుచోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
Andhra Pradesh News Live March 22, 2025: AP TG Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్- రేపు ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Srikakulam News : ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కోసం అక్రమాలు, పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలు-11 మంది టీచర్ల సస్పెండ్
Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలకు సహకరించిన 11 మంది ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే 5 మంది విద్యార్థులను డిబార్ చేశారు. ట్రిపుల్ ఐటీ సీట్లే లక్ష్యంగా మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోంది.
AP BC EBC Kapu Loans : బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ లోన్ల దరఖాస్తు గడువు పెంపు, ఈ నెల 25 చివరి తేదీ
AP BC EBC Kapu Loans : ఏపీ బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ లోన్ల దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పెంచారు. ఈ మేరకు బీసీ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త అప్లికేషన్లను https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSC Exam Dates : ఏపీపీఎస్పీ కీలక అప్డేట్-పాలిటెక్నికల్, జూనియర్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ పరీక్ష తేదీలు ప్రకటన
APPSC Exam Dates : ఏపీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పాలిటెక్నికల్, జూనియర్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టులకు పరీక్షల తేదీలను ప్రకటించింది. పరీక్షలను జూన్ 16వ తేదీ నుంచి నుంచి 26వ తేదీ వరకు ఏపీపీఎస్సీ నిర్వహించునుంది.
KCR : ఏపీలో కూటమి లేకుంటే సీఎం చంద్రబాబు గెలిచేవారు కాదు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
KCR : సిరిసంపదలున్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Posani Krishna Murali : గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల.. కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!
Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. గతనెల 26న అరెస్టైన పోసాని.. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం వరకు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు కోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను విడుదల చేశారు.
CM Chandrababu : అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటన, బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల గాంధీ కాలనీలో భారతరత్న అంబేడ్కర్ విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
Viveka Murder Case : వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు.. ఐదుగురిపై కేసు నమోదు!
Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేసుల పరంపర కొనసాగుతోంది. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో.. తాజాగా ఐదుగురిపై కేసు నమోదు అయ్యింది. హత్య సినిమా గురించి సునీల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు.