TTD Board Decisions : రూ.5258.68 కోట్ల బడ్జెట్ కు టీటీడీ ఆమోదం- పాలకమండలి కీలక నిర్ణయాలివే

TTD Board Decisions : తిరుమల శ్రీవారి భ‌క్తుల విజ్ఞప్తి మేర‌కు ఉద‌యం 5.30 గంట‌లకు బ్రేక్ ద‌ర్శనం స‌మ‌యం మార్చే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల‌కు ఆఫ్‌లైన్‌ ద‌ర్శనం క‌ల్పించేందుకు సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని నిర్ణయించింది.

Georgia University: ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ యూనివర్శిటీ.. జార్జియా నేషనల్ వర్శిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Georgia University: ఏపీలోని ఉత్తరాంధ్ర కు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రానుంది. జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జార్జియా నేషనల్ యూనివర్శిటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ కుదర్చుకుంది.

District Judges Recruitment : ఏపీలో 15 జిల్లా జడ్జిల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్, ముఖ్యమైన వివరాలు ఇవే

District Judges Recruitment : ఏపీలో జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 15 జిల్లా జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు మార్చి 27 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు.

APSRTC Special Buses : రాజ‌మండ్రి నుంచి సువార్త యాత్ర స్పెష‌ల్‌.. విశాఖ‌ప‌ట్నం నుంచి భ‌ద్రాచ‌లానికి స‌ర్వీసులు

APSRTC Special Buses : హిందూ, క్రైస్త‌వ భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. రాజ‌మండ్రి నుంచి సువార్త యాత్ర స్పెష‌ల్ పేరుతో ప్ర‌సిద్ధి చ‌ర్చ‌ల‌ను సంద‌ర్శించేందుకు ల‌గ్జరీ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ‌రామన‌వ‌మి పుర‌స్క‌రించుకుని విశాఖ‌ నుంచి భ‌ద్రాచ‌లానికి స‌ర్వీసుల‌ను నడపనుంది.

Eluru Crime : ఏలూరు జిల్లాలో ప్రేమ పేరుతో బాలిక‌పై యువ‌కుడు అత్యాచారం- వీడియోలున్నాయని అత‌డి స్నేహితులు లైంగిక‌దాడి

Eluru Crime : ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ అతడి స్నేహితులు కూడా బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్- జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు ఖాతాల్లో జమ

AP Govt Employees : ఏపీ ప్రభుత్వం…ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఉద్యోగులకు జీఎల్ఐ, జీపీఎఫ్ కింద చెల్లించాల్సిన రూ.6200 కోట్ల బకాయిల విడుదల ప్రక్రియ మొదలైంది. సోమవారం నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు జమ అవుతున్నాయి.

Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. మరింత ముదిరిన డైలాగ్ వార్!

Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. డైలాగ్ వార్ మరింత ముదిరింది. తన కాల్ డేటా తీశారని రజిని సంచలన ఆరోపణలు చేయగా.. తాజాగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. తన ఇంట్లోనూ మహిళలు ఉన్నారని.. తామెందుకు కాల్ డేటా తీయిస్తామని ప్రశ్నించారు.

Vijayawada Tourism : టూరిజం హబ్‌గా విజయవాడ.. పుదుచ్చేరి తరహాలో బ్రాండింగ్.. 10 ముఖ్యమైన అంశాలు

Vijayawada Tourism : విజయవాడను పుదుచ్చేరి తరహాలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బెజవాడలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కృష్ణా తీరాన్ని టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేయనున్నారు.

AP Deepam 2 Scheme : ఉచిత గ్యాస్ స్కీం అలర్ట్.. ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలి!

AP Deepam 2 Scheme : ఉచిత గ్యాస్ స్కీంకు సంబంధించి అల‌ర్ట్ వ‌చ్చింది. నెలాఖ‌రులోగా మొద‌టి సిలిండ‌ర్ బుక్ చేసుకోవాలి. లేదంటే 3 ఉచిత సిలిండ‌ర్ల‌లో ఒకటి కోల్పోతారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండ‌ర్ కోసం బుకింగ్ స్టార్ట్ అవుతుంది. మొద‌టి ఏడాది బుక్ చేసుకోనివారు.. వెంట‌నే చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.

AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నేటి ముఖ్యాంశాలు.. 11 హైలైట్స్

AP Telangana Today : వైజాగ్ వేదికగా.. ఐపీఎల్ మ్యాచ్ జగనుంది. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇవాళ్టి ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

Rjy Double Murders: విషాదాంతమైన మైనర్‌ ప్రేమ వ్యవహారం, రాజమండ్రిలో తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Rjy Double Murders: రాజమహేంద్రవరంలో మైనర్‌ ప్రేమ వ్యవహారం చివరకు విషాదంగా ముగిసింది. ప్రేమించిన యువకుడి చేతిలోనే తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. 16ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లిని యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Andhra Pradesh News Live March 23, 2025: APPSC : ఏపీపీఎస్సీ అల‌ర్ట్‌- ఉద్యోగుల‌కు కంప్యూట‌ర్ ప్రావీణ్య ప‌రీక్ష, ఏప్రిల్ 12, 13 తేదీల్లో నిర్వహ‌ణ

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.