Durga Temple Lands: దుర్గమ్మకే శఠగోపం.. కారుచౌకగా దుర్గగుడి భూముల లీజుకు ప్రయత్నాలు, దేవాదాయ శాఖ అభ్యంతరం

Durga Temple Lands: విజయవాడలో కోట్లాది రుపాయల ఖరీదు చేసే దుర్గగుడి భూముల్ని కారు చౌకగా యాభై ఏళ్లకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత లీజు గడువు ముగియడంతో నామ మాత్రపు ధరకు మరో యాభై ఏళ్లకు పొడిగించాలని దేవాదాయ శాఖపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

AP Mega DSC : ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. జూన్‌లో పోస్టింగ్.. చంద్రబాబు కీలక ప్రకటన!

AP Mega DSC : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పారు. జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.

Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త్య చేసిన భార్య

Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోర‌ం జరిగింది. భార్య వేరే వ్య‌క్తితో, భర్త మరో మహిళతో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నారు. అయితే భార్య‌ను భ‌ర్త వేధిస్తున్నాడు. త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన భార్య‌, భ‌ర్త‌ను క‌డ‌తేర్చాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త‌మార్చింది.

AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి నేటి ముఖ్యాంశాలు.. 10 హైలైట్స్

AP Telangana Today : ఏపీలో వడగాలులు వీచే అవకాశం, తెలంగాణ ఉష్ణోగ్రతలు, కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోకి ఈడీ ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

Parking Free: సినిమా టిక్కెట్స్‌, షాపింగ్ బిల్స్‌ ఉంటే మాల్స్‌లో పార్కింగ్ ఫ్రీ, ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ…

Parking Free: ఏపీలో షాపింగ్‌ మాల్స్‌ పార్కింగ్ ఫీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఎన్ని హెచ్చరికలు చేసినా మాల్స్‌ నిర్వాహకులు పార్కింగ్ పేరుతో ప్రజల్ని అడ్డగోలుగా దోచుకోవడం ఆగడం లేదు. దీంతో మాల్స్‌ పార్కింగ్‌ ఫీజులపై పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

NRI Suicide: ఆర్ధిక ఇబ్బందులతో అమెరికాలో గుడివాడ యువకుడి ఆత్మహత్య.. విషాదంలో కుటుంబం

NRI Suicide: అమెరికాలో ఏపీకి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

AP Govt GNU : ఏపీలో ఉన్నత విద్యకు మరో ముందడుగు, రూ.1300 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ యూనివర్సిటీ -మంత్రి లోకేశ్

AP Govt GNU Agreement : ఏపీలో అంతర్జాతీయ విద్యాసంస్థ అడుగుపెట్టనుంది. రూ.1300 కోట్ల పెట్టుబడులతో జీఎన్యూ సంస్థ ఉత్తరాంధ్రలో యూనివర్సిటీ స్థాపించడానికి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యకు పెద్ద ముందడుగు పడిందని మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేపు ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు

AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రేపు ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రేపు ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Andhra Pradesh News Live March 24, 2025: AP Govt GNU Agreement : ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ యూనివర్సిటీ, జీఎన్‌యూతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Balabhadrapuram : బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు,38 అనుమానిత కేసులు -మంత్రి సత్యకుమార్

Balabhadrapuram Cancer Screening : తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సర్వే 38 అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించామన్నారు. అనుమానిత కేసులలో 10% నుంచి 15% వరకు పాజిటివ్‌ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

CPM On TDP: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి ప్రమాదకరం.. పార్లమెంటులో ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్

CPM On TDP:పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సీపీఎం అభిప్రాయపడింది. బీజేపీ కుట్రలో భాగస్వామ్యం కావద్దని, డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని, పార్లమెంటులో టిడిపి,జనసేన ఎంపిలు ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

AP Pensions: అర్హత ఉన్న వారి పెన్షన్లను తొలగించడం లేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం,విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్

AP Pensions: ఏపీలో పెన్షన్ల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిర్దేశిత ప్రమాణాల మేరకు అర్హతలు ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించడం లేదని, వికలాంగులైన విద్యార్థులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు పెన్షన్లు జమ చేస్తున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు.