మహేష్ – రాజమౌళి కలయికలో పాన్ ఇండియా బిగ్గెస్ట్ సినిమా ప్రారంభం!

మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడుప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నేడు (తేదీ), హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ భారీ చిత్రానికి ముహూర్త కార్యక్రమాలు నిశ్శబ్దంగా నిర్వహించారు. సినిమా బృందం మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైంది.
వింటేజ్ చిరు” వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్!

ఈ సినిమాలో చిరు వింటేజ్ లుక్లో కనిపిస్తారనే వార్తలపై స్పందించిన శ్రీకాంత్ ఓదెల, తాను మెగాస్టార్ కోసం ప్రత్యేక కథను సిద్ధం చేస్తున్నానని వెల్లడించాడు. చిరు పాత్ర పూర్తిగా తన వయసుకు తగ్గట్టుగా ఉంటుందని, ఆయన అభిమానులకు కొత్తగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పాడు.
అభిమానుల కోసం శుభవార్త 7/జి బృందావన్ కాలనీ సీక్వెల్ రెడీ!

సెల్వ రాఘవన్ 7/జి బృందావన్ కాలనీ 2ను అధికారికంగా ప్రకటించగా, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. ఈ పోస్టర్లో దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరామెన్ పేర్లు మాత్రమే ఉండగా, నటీనటుల వివరాలు వెల్లడించలేదు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగా స్టార్ సినిమాతో పూరీ తిరిగి ట్రాక్లోకి వస్తాడా?

ఇప్పుడు పూరీ ‘ఆటో జానీ’ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో, పూరీ కూడా ఆయనతో కలిసి ‘ఆటో జానీ’ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తనకు సాలిడ్ కమ్బ్యాక్ రావాలని పూరీ ఆశపడుతున్నాడు.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది కానీ, మెగా అభిమానులు ఈ కాంబినేషన్ను తెరపై చూసేందుకు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ…ప్రపంచ స్దాయి స్టూడియోల నిర్మాణం పై దృష్టి.

ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా ఇచ్చారు . తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నట్లు. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కూడా తమకు ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేశారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయటంతో పాటు… సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అనుష్క నటిస్తున్న ‘ఘాటీ’లో కొత్త స్పెషల్ రోల్!

ఈ వీడియోలో అనుష్క, చీర కట్టులో తలపై ముసుగు వేసి నడుస్తూ కనిపించారు. వీడియోలో ఆమె శరీరభాష, లుక్ సినిమాపై ఆసక్తి కలిగించింది. సినిమా నెగిటివ్ రోల్ కోసం ఒక సీనియర్ హీరో కనిపించనున్నారని టాక్ ఉంది. ఇది ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
వైల్డ్ లుక్లో ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ..!

NTR 31 కోసం ప్రశాంత్ నీల్ కొత్తగా యూరప్ లోని నల్ల సముద్రం ప్రాంతంలో కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమా విజువల్గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం కోసం ప్రత్యేకంగా లొకేషన్స్ను ఎంచుకున్నారు.. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే NTR 31 సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ పీరియడ్ సినిమా తారక్ అభిమానులకు ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్గా ఉండబోతోందని అంతా భావిస్తున్నారు.
సలార్ 2 గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారో తెలుసా?

సలార్ 2 కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ మాటల ఆధారంగా, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతుంది. మాస్ ఎంటర్టైనర్ గా మళ్లీ ప్రభాస్ తన అభిమానులకు పండగను అందించనున్నాడు.
నవీన్ పోలిశెట్టి ‘పెళ్లి’ వెనుక మిస్టరీ కథ

ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలో, టీజర్ ప్రోమోలో, సోషల్ మీడియా పోస్టుల్లో డైరెక్టర్ పేరు లేకపోవడం గమనార్హం.మేకర్స్ కేవలం హీరో నవీన్ పోలిశెట్టి మరియు నిర్మాణ సంస్థల పేర్లను మాత్రమే ప్రస్తావించారు.దీనితో, దర్శకుడిని ప్రస్తావించకపోవడానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరికొత్త అవతారంలో సూర్య ..రెట్రో” టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ ..!

క్రిస్మస్ సందర్భంగా విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ..దర్శకుడు ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. సూర్య కొత్త లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు..”కంగువ” ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, “సూర్య 44” చిత్రం ద్వారా సూర్య మరోసారి హిట్ కొడతాడని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.
దేవర-2’ కోసం కొరటాల శివ కొత్త ప్రయాణం ప్రారంభం

ఈ విజయవంతమైన సినిమాకు సీక్వెల్ చేయడానికి దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే పనులు జరుపుకుంటున్నాయి. కథలో కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలచేందుకు దర్శకుడు తన టీమ్తో శ్రద్ధతో పని చేస్తున్నారని సమాచారం.వచ్చే ఏడాది నుంచి ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
‘డాకు మహారాజ్’ వేడుకకు సర్ప్రైజ్ గెస్ట్!

డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ లెవెల్లో నిర్వహించేందుకు చిత్ర బృందం పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. జనవరి మొదటి వారంలో ఈ వేడుక జరగనుంది. అయితే ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా ఓ ప్రముఖ అతిథిని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.