ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. చంద్రగిరి ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫీడ్ బ్యాక్ తీసుకొని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు.