ప్రయాగ్‌రాజ్‌లో మంత్రి నారాయణ పర్యటన: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ గారు, ఈ రోజు ప్రయాగ్రాజ్ లో పర్యటించి 2027లో గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై అధ్యయనం చేసారు. ఈ సందర్భంగా, ఆయన కుంభమేళా అథారిటీ ఆఫీసుకి వెళ్లి, స్థానిక యూపీ అధికారులతో సమావేశమయ్యారు.

మంత్రికి, గోదావరి పుష్కరాల సందర్భంలో జరిగే ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడం, గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేపట్టే భక్తుల కోసం సాధ్యమైన సహాయాన్ని అందించడం అనేది ప్రధాన టార్గెట్.

సమావేశంలో నారాయణ గారు పుష్కరాల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి పంపిన ప్రతినిధుల సహాయంతో అవగాహన కలిగి, మున్ముందు చేపట్టాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాల ఉత్సవం జరగడం కోసం ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని మంత్రి నారాయణ సూచించారు.

తాజా వార్తలు