ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ లో 9 రోజుల పాటు మేధావులతో చర్చలు నిర్వహించాలని నిర్ణయించగా, ఈ చర్చలకు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
ఈ నెల 18న గుంటూరులో జరుగబోయే చర్చకు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 19న తిరుపతిలో జరిగే చర్చకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు.
ఈ నెల 21న విజయవాడలో నిర్వహించే సమావేశానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి హాజరుకానున్నారు. 22న విశాఖలో జరిగే చర్చకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరుకాబోతున్నారు. అదే రోజున రాజమండ్రిలో జరిగే సమావేశానికి బీజేపీ ఎంపీ పురందేశ్వరి, కాకినాడలో జరిగే సమావేశానికి మరో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హాజరుకానున్నారు.
ఇతర సమావేశాల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. 2025-26 బడ్జెట్ పై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్చలు సాగనున్నాయి.