ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మరియు ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా, వారు గంగాదేవిని ప్రార్థిస్తూ, పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
మహా కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య లోకేశ్ దంపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని, భక్తితో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా, నారా లోకేశ్ మాట్లాడుతూ, మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి చెందిన ఒక శక్తిమంతమైన వేడుక అని పేర్కొన్నారు. ఇది నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న ఒక అత్యంత పవిత్రం అనుభవమని చెప్పారు.
నాడు, మానవత్వం మరియు ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని ప్రతిబింబించే ఈ వేడుక, భారతజాతి లోతైన విలువలను ప్రజలకి గుర్తు చేస్తుందని ఆయన వివరించారు.
“పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దానం చేయడం, హృదయపూర్వకమైన భక్తితో ప్రార్థనలు చేయడం మోక్ష మార్గాన్ని చూపిస్తాయి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం, నారా లోకేశ్ మరియు బ్రాహ్మణి దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.