పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తూ ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్ర చేస్తుండగా, ఈ రోజు ఆయన తమిళనాడులో పర్యటించారు. పవన్ కళ్యాణ్ తన యాత్రలో భాగంగా కుంభకోణంలోని ప్రఖ్యాత ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, స్థానికులతో సమావేశమై వారికి ఆశీర్వాదాలు ఇచ్చారు.

ఆయన ఈ సందర్బంగా పలువురు స్థానికులతో సెల్ఫీలు దిగిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేసిన వారితో పవన్ కళ్యాణ్ దిగిన ఈ సెల్ఫీలు ఆన్‌లైన్‌లో వేగంగా చర్చకు వస్తున్నాయి.

ఇక, జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ సంఘటనపై సానుకూల స్పందన తెలుపుతున్నారు.

తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ ఉదయం తంజావూరులోని స్వామిమలై ఆలయానికి కూడా పర్యటించారు. అక్కడ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరానందన్ తో కలిసి పూజలు చేశారు.

ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా, పవన్ కళ్యాణ్ అనేక ప్రాచీన ఆలయాలను సందర్శించడానికి మళ్లీ ముందుకు సాగారు.

https://www.instagram.com/reel/DGAcg2dTOrP/?utm_source=ig_web_copy_link

Discover more from EliteMediaTeluguNews

Subscribe to get the latest posts sent to your email.

Discover more from EliteMediaTeluguNews

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading