అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తాజా సమాచారం వెల్లడైంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, అక్రమ వలసదారుల గుర్తింపు మరియు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో, ట్రంప్ ప్రభుత్వం సరైన ధ్రువపత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా తమ దేశంలో అడుగుపెట్టిన భారత పౌరుల్ని స్వదేశానికి పంపింది. తాజాగా, 205 మంది భారతీయులను ఒక ప్రత్యేక విమానంలో టెక్సాస్ నుంచి స్వదేశానికి పంపించారు. ఈ విమానం సీ-17, ఈరోజు మధ్యాహ్నం అమృత్సర్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది.
సమాచారం ప్రకారం, ఈ ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చిన వారంతా పంజాబ్ మరియు చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారు అని తెలుస్తోంది. అవసరమైన సోదాల అనంతరం, వారు విమానాశ్రయాన్ని వదిలి స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అమెరికా హోంలాండ్ అధికారుల గణాంకాల ప్రకారం, 20,407 మంది భారతీయులు సరైన ధ్రువపత్రాలు లేనిట్లు తేలింది. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేయగా, 2,467 మంది ఈఆర్ఓ (ఎన్ఫోర్స్మెంట్ రిమూవల్ ఆపరేషన్స్) నిర్బంధంలో ఉన్నారు. మొదటి విడతలో 205 మందిని వెనక్కి పంపినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ చర్యలు అమెరికా ప్రభుత్వానికి విదేశీ వలస విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుండి భారత్కు పంపబడే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.