Etikoppaka Toys : దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో వివిధ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించాయి. వీటిల్లో ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటాన్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఏటికొప్పాక బొమ్మలకు ఘన చరిత్ర ఉంది.