టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా నియామకం అయ్యాక జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టారు..
ఈ రోజు గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మూడు జిల్లాల సమీక్ష సమావేశాలు జరిగాయి. ముందుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ ముంన్షి, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ గార్లు పాల్గొని జిల్లా లోని పార్టీ పటిష్టత కు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షలు, జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాలలో ప్రధానంగా మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు పాల్గొని నాయకులనుంచి పార్టీ విషయాలను చర్చించారు. వరంగల్ నుంచి మంత్రి కొండా సురేఖ, ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కావ్య, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సమావేశంలో ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తోపాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్లు ఎంపీ సురేష్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పని తీరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విదంగా చర్యలు, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టడం లాంటి అంశాలపై చర్చించారు..
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.