TTD Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తైంది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేశారు. 3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది. 13వ తేదీ నుంచి తిరిగి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.