హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్

హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద రేపు బీసీ మహాసభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని కోరుతూ ఆమె విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ద్వారా కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో కవిత ఇప్పటికే బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించి మహాసభ Posters విడుదల చేశారు. అయితే, సభకు ఇప్పటివరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. గురువారం ఉదయం నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద తెలంగాణ జాగృతి ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు