2027లో వెండితెరపై మహేష్ బాబు & రాజమౌళి మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉండండి!

2027లో వెండితెరపై మహేష్ బాబు & రాజమౌళి మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉండండి!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్, గ్రాండ్ విజన్ కలిగిన ప్రాజెక్ట్. ఇప్పటికే ₹1,000 కోట్ల బడ్జెట్, రెండు భాగాలుగా విడుదల అనే విషయాలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్..?
ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా నటిస్తుందనే వార్తలొచ్చాయి. అయితే, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం:

ఆమె పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్స్‌తో ఉండనుంది. ఒక ప్రధాన ప్రతినాయికగా ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఇటువంటి పాత్రలు చాలా అరుదు కాబట్టి, ఈ వార్త అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేపుతోంది.

విలన్ మార్పులు – జాన్ అబ్రహాం ఎంట్రీ?

ఇప్పటి వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్య విలన్‌గా నటించనున్నారని టాక్ వచ్చింది. కానీ, తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహాం ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, ఇది మహేష్ బాబు కెరీర్‌లో ఓ కొత్త ఇంటెన్స్ యాక్షన్ ఛాలెంజ్ అవుతుంది. త్వరలోనే ఈ అంశంపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రియాంక చోప్రా షూటింగ్ గ్యాప్ – రాజమౌళి ప్లాన్ ..:
ఇటీవల ప్రియాంక చోప్రా, తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం ముంబై వెళ్లడం జరిగింది.

దీంతో, ఆమె షూటింగ్‌కు తాత్కాలిక విరామం తీసుకుంది.అయితే, రాజమౌళి ఎప్పుడూ లాజిక్‌తో పని చేసే దర్శకుడు. ఆమె లేకుండా ఇతర కీలక సన్నివేశాలను ముందుగా ప్లాన్ చేసుకుని షూట్ చేస్తున్నారు. మహేష్ బాబుతో సంబంధమైన కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు.

దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ – భారీ బడ్జెట్ & విడుదల ప్లాన్ :

ఈ భారీ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా ₹1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ , మొదటి భాగాన్ని 2027లో రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.SSMB29 సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక లాండ్‌మార్క్ ప్రాజెక్ట్ అవ్వనుంది.

భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ లెవెల్ మేకింగ్, కొత్త స్టైల్ కథనం – ఇవన్నీ సినిమా క్రేజ్‌ను విపరీతంగా పెంచాయి.ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్, జాన్ అబ్రహాం విలన్‌గా మార్పు – ఇవన్నీ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.మొత్తానికి, ఈ మూవీ ఇండస్ట్రీని ఓ పాన్-వరల్డ్ లెవెల్ బ్లాక్‌బస్టర్ గా నిలబెడుతుందని సినీ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

తాజా వార్తలు