జనక్ ప్రసాద్: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న సింగరేణిలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఫలితాలు సాధించిందని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సింగరేణి సంస్థపై ప్రత్యేక దృష్టి సారించి, దసరా పండుగకు కార్మికులకు లాభాలను అందజేశారు.
ప్రతి కార్మికుడికి ₹90,000 బోనస్
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీగా బోనస్ ప్రకటించింది. సింగరేణి చరిత్రలో మొదటిసారి కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ ఇచ్చారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుమారు రూ. 90,000 బోనస్ ను ప్రతి కార్మికుడికి పంపిణీ చేయడం జరిగింది.
బీఆర్ఎస్ విమర్శలు
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, “బోనస్ కాదు బోగస్” అని వ్యాఖ్యానించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ₹13,751 బోనస్ మాత్రమే కార్మికులకు అందజేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఎప్పుడూ సరైన లాభాల వివరాలు చెప్పలేదని కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు.
సింగరేణి అద్భుత విజయాలు – రేవంత్ రెడ్డి
సింగరేణి సంస్థకు ఈసారి రూ. 4,000 కోట్ల లాభాలు వచ్చినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో రూ. 2,000 కోట్లు కార్మికులకు పంచుతూ, మిగతా రూ. 2,000 కోట్లు భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావులు ఇంత స్పష్టతగా ఎప్పుడూ చెప్పలేదని ఆయన విమర్శించారు.
సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం
సింగరేణి కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంపై భారీగా విశ్వాసం ఉంచారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. “బీఆర్ఎస్ మళ్లీ బోగస్ అంటూ మాట్లాడితే, వారి అసలు శక్తి ఏంటో చూపిస్తాం” అంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.