కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75వ వసంతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, తెలంగాణలో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో’ (రాజ్యాంగ పరిరక్షణ) కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
ఈ సందర్బంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని గౌడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ నేతలు దేశ రాజ్యాంగం పరిరక్షణ పై కీలక సందేశాలను ప్రజలకు అందించనున్నారు.