మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం: కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టి ఎనిమిది మంది మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయని వదంతులు ప్రచారంలో రావడంతో, భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ నుండి దిగిపోయారు.

పట్టాలు దాటుతూ ట్రైన్ నుండి దిగిన ఆ ప్రయాణికులు, మరో వేగంగా దూసుకువస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ట్రైన్‌కి ఢీకొట్టడంతో ఈ విషాదం జరిగింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సహాయక చర్యలు ప్రారంభం: ఈ విషాద సంఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్ పలు గంటల పాటు గాయాలపాలైన ప్రయాణికులను రక్షించారు.

ప్రమాదానికి కారణాలు: ప్రాథమిక సమాచారం ప్రకారం, పుష్పక్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు రావడంతో ప్రయాణికుల మధ్య ఆందోళనలు ఉత్పన్నమయ్యాయి. కానీ, ఈ ఘటనకు పూర్తి విచారణ జరపాలని రైల్వే అధికారులు చెప్పారు. అధికారులు ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి శీగ్రంగా విచారణ ప్రారంభించారు.

ఈ ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సైతం స్పందించి, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వార్తలు