ధనుష్ సమర్పణలో, వండర్బార్ ఫిల్మ్స్ మరియు ఆర్కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగులో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ధనుష్ తన గత బ్లాక్బస్టర్స్ పా పాండి, రాయన్ వంటి చిత్రాల తర్వాత, మరోసారి దర్శకుడిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా, చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి, సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంది.
జాన్వీ నారంగ్ మాట్లాడుతూ, “మేం ఓ కొత్త లవ్ స్టోరీతో రాబోతోన్నాము. ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని ఇచ్చిన ధనుష్ గారికి థాంక్స్. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.
అనికా సురేంద్రన్ చెప్పారు, “మా చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేయండి. మా చిత్రాన్నితెలుగులో విడుదల చేస్తున్న ఏషియన్, సురేష్ గార్లకు థాంక్స్” అని తెలిపారు.
రబియా ఈ చిత్రంతోనే ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారని చెప్పారు. “ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. మేం అందరం కొత్త వాళ్లం. ఈ సినిమాను ఆదరించండి. ఫిబ్రవరి 21న థియేటర్లలో మేం అందరూ రాబోతున్నాం” అని అన్నారు.
వెంకటేష్ మీనన్ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నామని చెప్పారు, “మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి” అని అన్నారు.
రమ్య రంగనాథన్ అన్నారు, “నాకు తెలుగు భాష ఎక్కువగా రాదు. ఈ మూవీతోనే నేను తెరకు పరిచయం కాబోతోన్నాను. ఈ సినిమా ప్రమోషన్స్కు హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. మా సినిమాను ఫిబ్రవరి 21న థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి” అని తెలిపారు.
పవిష్ అన్నారు, “వెంకీ అట్లూరి గారి వల్లే నేను కెమెరా ముందుకు రాగలిగాను. మా చిత్రం ఫిబ్రవరి 21న రాబోతుంది. అందరూ చూసి ఆదరించండి” అని చెప్పారు.
ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్యతను అందించేందుకు రెడీగా ఉంది, ధనుష్ దర్శకత్వంలో ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల కానుంది.