తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి: అదానీ గ్రూప్ రూ. 100 కోట్లు విరాళం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం ప్రకటించింది.
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధుల బృందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలసి ఈ విరాళం చెక్కును అందించారు. ఈ సందర్భంగా, నైపుణ్యాభివృద్ధి మరియు యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గౌతమ్ అదానీ అంకితమైన మద్దతును ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మరియు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.