కేరళలోని తిరువనంతపురం నగరంలో గత రాత్రి జరిగిన ఓ దారుణ ఘటన పట్ల పోలీసులు షాక్కు గురయ్యారు. 23 ఏళ్ల అఫాన్ అనే యువకుడు పోలీసుల వద్ద లొంగిపోయాడు మరియు అతను తల్లి, తమ్ముడు, ప్రియురాలు సహా ఆరుగురిని హత్య చేశానని పోలీసులకు తెలిపాడు.
నిన్న సాయంత్రం, అఫాన్ నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి, “నేను కొన్ని గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నా తల్లి, తమ్ముడు, గాళ్ఫ్రెండ్తో సహా ఆరుగురిని హత్య చేశానని” అన్నాడు. దీనితో షాకైన పోలీసులు, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అతడి హత్య బాధితులైన ఐదుగురి మృతదేహాలను గుర్తించి, మరొకరిని చావుబతుకుల పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. హత్యలు సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో జరిగినట్లు గుర్తించారు. హత్యకు గురైన వారి జాబితాలో 13 ఏళ్ల సోదరుడు, నానమ్మ సల్మాబీవీ, పెద్దనాన్న లతీఫ్, పెద్దమ్మ షాహిహా, మరియు ప్రియురాలు ఫర్షానా ఉన్నారు.
అయితే, నిందితుడి తల్లి ప్రస్తుతం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నట్లు సమాచారం. తాను కూడా విషం తీసుకున్నానని చెప్పిన అతనిని, పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఈ దారుణ ఘటనకు గల కారణాలు ఇంకా అన్వేషణలో ఉన్నాయి. పోలీసులు కేసు విచారణను ప్రారంభించి, నిందితుడు చేసిన హత్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నిస్తున్నారు.