వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని, కూటమి ప్రభుత్వంపై పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తీవ్రంగా విమర్శించారు. ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం పేదలకు “సంజీవని” వంటిదని, ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ. 3 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను ఆపేశాయని రజని పేర్కొన్నారు. “ఓటు వేసి గెలిపించిన ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని” ఆమె అన్నారు. ప్రభుత్వ వ్యవహారశైలి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు.
2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారని చెప్పారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని రజని డిమాండ్ చేశారు.