మంగళగిరి: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మరియు తుళ్లూరు మండలంలో ఈ స్కిల్ సెన్సస్ ను ప్రారంభిస్తున్నారు.
గ్రామసచివాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే, వాటిని సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను కల్పించడం. ప్రభుత్వానికి యువతా సంక్షేమం మీద మక్కువ ఉందని ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి స్పష్టం అవుతుంది.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.