కిన్నెర వాయిద్య విద్వాంసుడు దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్య గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయత్ నగర్లో 600 చ. గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారితో కలిసి మొగిలయ్య గారికి అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, “తెలంగాణ సాంస్కృతిక సంపదలో కిన్నెర వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది. దర్శనం మొగిలయ్య గారు ఈ సంప్రదాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఈ శ్రద్ధకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున ఇల్లు నిర్మించుకునే స్థలాన్ని కేటాయించడం పట్ల గర్వంగా ఉంది,” అని అన్నారు.
కిన్నెర మొగిలయ్య గారు సీఎం గారికి మరియు ప్రభుత్వం పై తమ కృతజ్ఞతలను తెలియజేశారు. “ఈ ప్రోత్సాహం నా జీవితంలో చాలా ప్రత్యేకం. నా కళను మరింత కొనసాగించేందుకు ఇది నాకు మరింత ప్రేరణగా నిలుస్తుంది,” అని మొగిలయ్య గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.